Kinnera sridevi రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918 లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది.నిజానికి 1926 లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి ' పేరుతో పౌరాణిక వస్తువుతో ' బలిచక్రవర్తి చరిత్రం ', ' భీష్మోదయం ', ' గరుడ చరిత్రం ' కథలురాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించవలసిన పని లేదు.…