Janumaddi Hanumath Sastry డా॥ జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు 1925 అక్టోబర్ 20న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. శ్రీమతి జానకమ్మ, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగార్లు వీరి తల్లిదండ్రులు. ఎం.ఏ (ఇంగ్లీష్), ఎం.ఏ (తెలుగు), బి.ఇడి, రాష్ట్ర విశారద వంటి కోర్సులు అభ్యసించారు. పాఠశాల ఉపాధ్యాయుడుగా, పాఠశాలల పరిశీలకులుగా, సర్వే అధికారిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా శాస్త్రిగారు పనిచేశారుచిన్న వయస్సులోనే శాస్త్రిగారు ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారు. ఆయన ఆరాధించిన వ్యక్తులతో కలసి పనిచేయడం ఆయన…
Category: సాహితీవేత్తలు
📚సాహితీ దిగ్గజం జానమద్ది 📒 janamaddi. నేడు వర్థంతి.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగు భాష ఉన్నంతకాలం జీవించి ఉండే సాహితీమూర్తి సాహితీ కల్పవృక్షం, పండితుడు , అనువాదకుడు ,పద్య, కవితా కథకునిగా వందలాది రచనలు చేసిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు ఓ సాహితీ దిగ్గజం. సాహిత్యంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి తపస్విగా నిలిచారు. ఆదర్శ జీవితాన్ని గడిపి తెలుగు భాషను మాతృభాషగా కొనసాగిస్తూ సాహిత్య రంగంలో అమరుడైయ్యారు. సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది తన సుదీర్ఘ రచనాకాలంలో ఎందరో పాఠకుల్ని అభిమానులుగా చేసుకుని ప్రశంసలు, పలు సన్మానాలనూ అందుకున్న సాహితీమూర్తి.…
మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసిందెవరో తెలుసా -maa telugu talli
ఆదికవి నన్నయ్య మొదలు నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి తెలుగు తల్లికి సదా నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు. వేలమంది తెలుగు కవులు తమదైన శైలిలో ఎన్నో రచనలను మనందిరికీ అందించి మనకు భాష మీద మమకారం రెట్టింపు అయ్యేందుకు, మనలో అణగారిపోతున్న భాషా శ్వాసకు ఊపిరి పోసి మన తెలుగు భాష పరిరక్షణకు పూనుకొన్నారు. అటువంటి ఆధునిక తెలుగు కవులలో…
వేమన శతకకర్తనే కాదు తత్వవేత్త తెలుసా – vemana.
వేమన హేతుబద్ధతవేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు.ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు.. మతాలు మంచే చెబుతుండవచ్చు కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన. ఆరు మతములందు నధికమైన మతంబులింగమతము కన్న లేదు భువినిలింగదార్ల కన్నా దొంగలు లేరయావిశ్వదాభిరామ వినుర వేమ. మతము వేషధార్లు మహిమీద పదివేలు.మూఢజనుల గలప మూగుచుండ్రుకొంగలు గుమికూడి కొరకవా బోదెలువిశ్వదాభిరామ వినుర వేమ.…
పాత్రికేయులకు ఆదర్శం విద్వాన్ విశ్వం-vidwan viswam.
మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి….ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఘనతను వ్యక్తపరచిన మహాత్ముడు… జీవితంలో సాహిత్యం, పత్రికా వ్యాసంగం ఉద్యమం ముప్పేటగా సాగించిన మహోన్నతుడు…. రాయలసీమ జనజీవితాన్ని ప్రతిబింబించిన తొలి కావ్యం పెన్నేటి పాటను అందిచిన రచయిత… మాణిక్యాల మూట…. విద్వాన్ విశ్వం విశ్వం పేరు వినగానే తెలుగువారికి 'పెన్నేటి పాట తో పాటు గుర్తుకు వచ్చేది. మాణిక్యవీణ'. తెలుగు పత్రికారంగంలో రచనకు వన్నె, వాసి సంతరించి పెట్టారాయన. తెలుపు నలుపు, అవీ-ఇవీ…
కోగటం అనగానే ఏ కవి గుర్తుకొస్తాడు? మీకు తెలుసా?kogatam
కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో' కోగటం గ్రామం కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది.2011 లెక్కల ప్రకారం, కోగటం గ్రామం జనాభా 3400.గ్రామం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2389 హెక్టార్లు.కోకటం గ్రామంలో సుమారు 848 ఇళ్ళు ఉన్నాయి.మహిళల జనాభా49.4 % ( 1678). మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).ఇది రాయలసీమ లోని వై ఎస్ ఆర్ జిల్లాకు చెందిన కమలాపురం మండలంలో ఉంది. కమలాపురం నుండి…
గడియారం వేంకట శేషశాస్త్రి-Gadiyaram venkata seshastry
బహుముఖ ప్రజ్ఞాశాలైన గడియారం వేంకట శేషశాస్త్రి కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె అగ్రహారంలో 1901లో రామయ్య, నరసమ్మ దంపతులకుజన్మించారు. రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య నాటకా లంకారాదులను, తర్క, జ్యోతిష, వాస్తు శాస్త్రాలను అభ్యసిం చారు.దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేసిఅవధాన పంచాననుడు'గా సన్మానాలు పొందారు. శాసన మండలి సభ్యుడుగా, సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా బాధ్యత లను నిర్వర్తించారు. శ్రీనాధ కవితా సామ్రాజ్యము, తిక్కన కళావైదగ్యము, ఉత్తర రామాయణ కావ్యశిల్పము వీరి విమర్శనా గ్రంథాలు,ఉత్తర రామాయణము…
పాశ్చాత్య భావనలను తెలుగు సాహిత్య విమర్శకు అన్వయంచేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య
Vallampati venkata subbaiah 1937వ సంవత్సరంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లారొంపిచర్లలో పుట్టారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేశారు. బోధనా రంగానికి అవసరమైన బి.ఇడ్, ని, ఇంగ్లీషు టీచింగ్ డిప్లమా (పిజిడిటిఇ)ని అందుకున్నారు. "The Role of Indian Sensibility in the Teaching of English Literature" అనే అంశంపై సీఫెల్ లో పరిశోధన చేసి M.Litt. పట్టా పొందారు. బెసెంట్ థియోసాఫికల్ కళాశాల,మదనపల్లిలో చాలాకాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. పుట్టింది రాయలసీమలోనే…
యస్ కే యు వైస్ చాన్సిలర్ పి.కుసుమకుమారి ఎవరో తెలుసా – Kusuma kumari .
Kusumakumari, former vice chancellor కుసుమకుమారి చిత్తూరు జిల్లా మదనపల్లెలో నరసింహారెడ్డి దంపతులకు 1950వ దశకంలో జన్మించారు. 1972లో వేంకటేశ్వర విశ్వవిద్యా లయంలో ఎం.ఎ. తెలుగు చదివి ఆ తర్వాత కేతు విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో “బ్రిటిష్ కాలం నాటి తెలుగు ముద్రిత పత్రాల్లో హిందూస్థానీ ప్రతిధేయాలు” అనే అంశం మీద పరిశోధన చేశారు. అనంతపురంలోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో ఎనిమిదేళ్ళు అధ్యాపకులుగా పనిచేసి, ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు…
సొదుం జయరాం-jayaram
సొదుం జయరాం సొదుం జయరాంను సీరియస్ రచయితలందరూ గొప్పరచయితగా పేర్కొంటారు. ఫ్రాన్స్ రచయిత గైడీమపాసా ప్రభావం తన కథల మీద వుందనీ ఆయన చెప్పేవాడు. అందువల్లనే ఆయన కథలన్నీ నిరాడంబరంగా అత్యంత సంక్షిప్తంగా వుంటాయి. ఒక్కపదం, ఒక్క అక్షరం కూడా వృథాగా వుండకూడ దంటాడాయన. రా.రా. శిష్యవర్గంలో గురువును మించిన శిష్యుడాయన. ఆయన రాసిన 'వాడిన మల్లెలు" కథను రా.రా. ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రా.రా.వంటి విమర్శకుల సహచర్యం ఆయనను గొప్ప రచయితగా తీర్చిదిద్దింది. పాలగిరి విశ్వప్రసాద్ వంటి…